ముంబై: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్ యుద్ధ విమానం మంగళవారం కుప్పకూలినట్లు పోలీసులు తెలిపారు.

సుఖోయ్ సు-30ఎంకేఐ విమానం పైలట్, కో-పైలట్ సురక్షితంగా బయటపడ్డారని నాసిక్ రేంజ్ స్పెషల్ ఇన్‌స్పెక్టర్ జనరల్ డీఆర్ కరాలే తెలిపారు.

షిరస్‌గావ్ గ్రామ సమీపంలోని పొలంలో విమానం కూలిపోయిందని ఐపీఎస్ అధికారి తెలిపారు.