న్యూఢిల్లీ, సెంట్రల్ ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ ప్రాంతంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుకు చెందిన ఏటీఎంలో బుధవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.

అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్రం 4.05 గంటలకు అగ్నిప్రమాదానికి సంబంధించి సమాచారం అందిందని, వెంటనే రెండు ఫైరింజన్లతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

సాయంత్రం 4.15 గంటలకు మంటలను అదుపులోకి తెచ్చామని, ఎలాంటి గాయాలు కాలేదని వారు తెలిపారు.