జైసల్మేర్ (రాజస్థాన్), రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలో ట్రక్కు ఢీకొనడంతో 60కి పైగా గొర్రెలతో పాటు గొర్రెల కాపరి మృతి చెందినట్లు పోలీసులు శనివారం తెలిపారు.

శుక్రవారం అర్థరాత్రి సంగద్ ప్రాంతంలో గొర్రెల కాపరి, అతని గొర్రెలపై ట్రక్కు దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగిందని వారు తెలిపారు.

ప్రమాదం జరిగిన తర్వాత లారీ డ్రైవర్‌ తన వాహనంతో అక్కడి నుంచి పరారయ్యాడు.

గొర్రెల కాపరి హనీఫ్ ఖాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంపై సమాచారం అందుకున్న దేవికోట్ పోలీసు ఔట్‌పోస్టు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.

కేసు నమోదు చేసి పరారీలో ఉన్న లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.