జైపూర్, రాజస్థాన్‌లోని బన్స్వారా జిల్లాలో కారు చెట్టును ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో ఇద్దరు గాయపడినట్లు పోలీసులు శనివారం తెలిపారు.

శుక్రవారం అర్థరాత్రి ఐదుగురు రెస్టారెంట్‌లో భోజనం చేసి తిరిగి వస్తుండగా బగిదోర-కళింజ్రా జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐదుగురు బన్స్వారాలోని ఓ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నారు. కారు వేగంగా వచ్చి చెట్టును ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. వారు రాత్రి భోజనం చేసి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు డీఎస్పీ వినయ్ చౌధర్ తెలిపారు.

మృతులను కుల్దీప్ కన్సారా, అజయ్ మైదా, షయాన్ యూసుఫ్‌గా గుర్తించారు, గాయపడిన వారు బన్స్వారాలోని ఎంజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.