మథుర (యుపి), ఇక్కడి నివాస కాలనీలోని వాటర్ ట్యాంక్ ఆదివారం కూలిపోవడంతో కనీసం ఆరుగురికి తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.

ఉత్తరప్రదేశ్ ఆవాస్ వికాస్ పరిషత్ అభివృద్ధి చేసిన కృష్ణ విహార్ కాలనీలో సాయంత్రం 6.00 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు.

డీఎం శైలేంద్ర కుమార్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. మూడేళ్ల క్రితం వాటర్ ట్యాంక్ నిర్మించారు.

కాగా, గాయపడిన వ్యక్తులు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని మధుర ఎస్‌ఎస్‌పి పిఆర్‌ఓ తెలిపారు.