న్యూఢిల్లీ: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఇక్కడి బుద్ధ జయంతి పార్కులో మొక్కలు నాటడం ద్వారా చెట్ల పెంపకం ప్రచారాన్ని ప్రారంభించారు.

‘ఏక్ పెద్ మా కే నామ్’ పేరుతో దేశవ్యాప్తంగా లక్షలాది చెట్లను నాటనున్నారు.

ఈ కార్యక్రమంలో మోదీతో పాటు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా పాల్గొన్నారు.