న్యూ యార్క్, చారిత్రాత్మక ఎన్నికల విజయంపై ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలుపుతూ టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ శుక్రవారం మాట్లాడుతూ, భారతదేశంలో తమ కంపెనీలు "ఉత్తేజకరమైన పని" చేయడం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

“ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నికల్లో విజయం సాధించినందుకు @narendramodiకి అభినందనలు! నా కంపెనీలు భారతదేశంలో ఉత్తేజకరమైన పనిని చేస్తాయని ఎదురు చూస్తున్నాను" అని మస్క్ ఎక్స్‌లో పోస్ట్‌లో పేర్కొన్నారు.

మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా జూన్ 9న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.