న్యూఢిల్లీ, ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ నివాసం వెలుపల గుమిగూడిన కొందరు వ్యక్తులు నల్లరంగు పూసుకుని నినాదాలు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు.

పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 143, 506, 153A మరియు 147 కింద కేసు నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసు అధికారులు తెలిపారు.

గురువారం కొందరు వ్యక్తులు ఒవైసీ నివాసానికి వచ్చి వీరంగం సృష్టించారని తెలిపారు. వారిపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.