అమరావతి, అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం గవర్నర్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌కు తన రాజీనామాను సమర్పించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

ఒక్క మంత్రి తప్ప జగన్ కేబినెట్ సహచరులంతా ఎన్నికల ఫలితాల్లో వెనుకంజలో ఉన్నారు.

స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ఆమదాలవలస అసెంబ్లీ సెగ్మెంట్‌లో టీడీపీ ప్రత్యర్థి కె.రవికుమార్ చేతిలో ఓడిపోయారు.

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు జగన్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.